మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా నవీ ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గెలిచిన జట్టు సెమీస్కు చేరనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పడుతుంది. దీంతో గెలుపుకోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.