హెడింగ్లీలో జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ తొలి టెస్టు చివరి రోజు ఉత్కంఠగా మారింది. ఇంగ్లండ్ గెలవాలంటే 350 పరుగులు అవసరం కాగా, భారత్ 10 వికెట్లు పడగొట్టాలి. ఇప్పటికే ఇంగ్లండ్ డ్రా కోసం కాకుండా విజయం కోసమే ఆడుతామని ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగిస్తే డ్రాగా ముగిసే అవకాశం ఉంది.