విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీకి బీసీసీఐ భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ప్రస్తుతం ‘A+’ కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లను ‘A’ కేటగిరీకి మార్చనున్నట్లు సమాచారం. ఈ జోడీ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దీంతో వారి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గనుంది.