మాజీ క్రికెటర్ పుజారా టీమిండియాకు చాలాకాలం కీలక బ్యాటర్గా ఉన్నాడు. టీ20ల్లో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయిన అతడు.. IPLలో KKR తరఫున ఆడాడు. అయితే, 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన IPL ప్రాక్టీస్ మ్యాచ్లో పుజారా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సౌతాఫ్రికాలోనే KKR యజమాని షారుఖ్ ఖాన్ అతడికి వైద్యం చేయించాడు. అనంతరం పూర్తిగా కోలుకున్న పుజారా ఐదు సీజన్ల పాటు IPLలో ఆడాడు.