WNP: న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ న్యాయసేవ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయసేవలు అందించేందుకు న్యాయ సేవాధికారసంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.