ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మృణాల్పై కీలక సన్నివేశాన్ని తెరకెక్కించారట. తదుపరి షెడ్యూల్లో బన్నీ, జాన్వీలపై ఓ లవ్ సీక్వెన్స్ను షూట్ చేయనున్నట్లు సమాచారం.