నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్(ajit pawar), పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్తో పాటు ఛగన్ భుజ్బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. 108 రోజుల పాటు పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సత్కరిస్తారు.
మీడియాతో తన ఆవేదనను వ్యక్త పరిచిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. క్షేత్రస్థాయిలో తనను ఎదుర్కొనే దమ్ము లేనొల్లే తన కూతుర్ని, అల్లుడిని అడ్డం పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నారని.. ఏమి తెలియని తన బిడ్డను రోడ్డుమీదకు తెచ్చారు.
తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.