పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించే వ్యక్తిని కాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు
త్వరలో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి పెళ్లి కాని పురుషులకు, స్త్రీలకు నెలవారిగా పింఛన్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన హర్యానా ప్రభుత్వం.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతోంది.
తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముంబయి చేరుకున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సంజయ్ మల్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (Tadipatri CI) ఆనందరావు(ananda rao) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) వెల్లడించారు. జూలై 8న వరంగల్లో నిర్వహించే మోడీ బహిరంగ సభకు 15 లక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్(maraboina raghunath yadav) రాహుల్ గాంధీ(rahul gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన జనగర్జన సభలో యువనేతకు పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు.
BRSను బంగాళాఖాతం(Bay of Bengal)లో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) వ్యాఖ్యానించారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ సభ ఏర్పాటు నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది పోరాడిన కూడా తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కార...
ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు చేరిన రాహుల్ గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కీలక నేతలు హాజరు శాలువాతో రాహుల్ ను సత్కరించిన భట్టి విక్రమార్క రాహుల్ కు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్న గద్దర్ పొంగులేటికి కండువా కప్పిన రాహుల్ గాంధీ దీంతోపాటు మరికొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం