ప్రకాశం: పీసీపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు గాయపడ్డాడు. వరిమడుగు విద్యుత్ ఫీడర్ పరిధిలోని మారెళ్ల చెరువు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద హెడ్ ఫ్యూజు పోవడంతో లైన్మెన్ సిలోమాన్కు సమాచారం అందింది. జంగాలపల్లికి చెందిన కొండారెడ్డి అనే ప్రైవేట్ వర్కర్ ఫ్యూజు వేయడానికి వెళ్లగా, సాంకేతిక లోపం వల్ల విద్యుత్ షాక్కు గురైనట్లు సమొచారం.
MDK: నిజాంపేట మండల నూతన విద్యాధికారిగా (MEO) బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం PRTU-TS సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పదవ తరగతి పరీక్షల్లో మండలం ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తానన్నారు.
తూ.గో: దేవరపల్లి మండలం పల్లంట్ల బీసీ కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్లను డ్రైనేజీల కోసం ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు ముందుగానే డ్రైనేజీలకు స్థలం కేటాయించి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి 25వ వార్డు సింగరేణి పాఠశాలను ఛైర్మన్ సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్తో సమావేశమై సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
MLG: పప్కపురంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నేతలు శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్, అధికార ప్రతినిధి లాలయ్య, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు, ఆత్మ ఛైర్మన్ అరుణ ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్లో కనిపిస్తారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచితంగా విద్యుత్ మీటర్ కనెక్షన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది అన్నారు.
సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో బుధవారం మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రారంభించే ఆదరణ 3.0లో వడ్డెరలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. రజకులకు ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
NLG: శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
KMM: సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డులో కరెంట్ షాక్కు గురైన వానరం పిల్లను రక్షించి గ్రామానికి చెందిన లక్ష్మీకాంతారావు, వెటర్నరీ అసిస్టెంట్ విజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. కరెంట్ షాక్తో కొట్టుమిట్టాడుతున్న మూగజీవిని గమనించిన యజమాని వెంటనే వైద్యుడు విజయ్ కుమార్కి సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆ వానరనికి వైద్యం అందించాడు.
HYD: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ శివసాయి నగర్లో రూ. 4 కోట్ల 55 లక్షలతో జరుగుతున్న బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పలు కాలనీలు వరద మురుగు నీటి ముంపుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
AP: అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లోకేష్ పేర్కొన్నారు.
BDK: దమ్మపేట రైతు వేదిక లో నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు మండల స్థాయిలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాల మొదటి విడత తరగతులకు నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు.
NGKL: అమ్రాబాద్(మం) మన్ననూరులో బుధవారం చెట్టు పైనుంచి పడి చెంచు యువకుడు కాళిదాసు(32) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మృతుడు కొబ్బరికాయల నిమిత్తమై చెట్టు పైకి ఎక్కి జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. చెట్టు పైకి ఎక్కించిన యజమానిపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
SDPT: బెజ్జంకి మండలంలోని రామసాగరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మంజూరైన రూ.10 లక్షలతో ఫీడర్ ఛానల్ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కాలువతో సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగి రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరేశం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.