CTR: SRపురం(M) మిట్టహరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో నవీన్కు చెందిన ఐదెకరాల చెరుకు పంట దగ్ధం అయింది. బాధితులను వైసీపీ నేత నారాయణస్వామి, నియోజకవర్గ ఇంఛార్జ్ కృపాలక్ష్మి పరామర్శించారు. బాధితులను కలెక్టర్ ఆదుకోవాలని వారు కోరారు. ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, బాధితులు మరో ఐదేళ్లు కోలుకునే అవకాశం లేదన్నారు.