• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మద్యం సేవించి వాహనం నడపోద్దు: ACP

WGL: వాహనదారులు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని మద్యం సేవించి వాహనం నడపోద్దని వరంగల్ ట్రాఫిక్ ACP సత్యనారాయణ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుపడిన వాహనదారులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలని అన్నారు. హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతారెడ్డి, తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 08:41 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల మెరుగుదలకు కృషి: MLA

MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA గడ్డం వినోద్ అన్నారు. గురువారం కాసిపేట్ మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:40 PM IST

పరీక్షా కేంద్రాల్లో క్రమశిక్షణ, గోప్యత పాటించాలి: అదనపు కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డేవిడ్ గురువారం సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో క్రమశిక్షణ, గోప్యత పాటించాలని, మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని తెలిపారు.

February 26, 2026 / 08:40 PM IST

గిరిజన హక్కుల పరిరక్షణపై సమావేశం

ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పెషల్ మానిటర్ (గిరిజన సంక్షేమం) హేమంత్ కుమార్ గురువారం సందర్శించారు. గిరిజనుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అటవీ భూమి హక్కులు, విద్యా-ఆరోగ్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 26, 2026 / 08:40 PM IST

‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

PPM: మక్కువ మండల కేంద్రంలో సాలూరు రవాణా శాఖ అధికారి జేవిఎస్ఎస్ ప్రసాద్ వాహనదారులకు స్పెషల్ డ్రైవ్ గురువారం నిర్వహించారు. వాహనదారులు విధిగా టాక్స్‌లు పెండింగ్ లేకుండా చూడాలని ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ వాహనానికి అన్ని రికార్డులను ఉంచుకోవాలని వాహనదారులకు ఆయన సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని వాహనదారులందరూ తప్పక నిబంధనలు పాటించాలన్నారు.

February 26, 2026 / 08:39 PM IST

రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల ఇక్కట్లు

BDK: బూర్గంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సింగారం రోడ్డు ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక గిరిజన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని మణుగూరు చెరువు సింగారం రోడ్డు మార్గం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 08:39 PM IST

ప్రజా పాలనలో పేద ప్రజలకు సంక్షేమం

BDK: ప్రభుత్వం ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచాయితి పరిధిలోని స్ధానిక రైతు వేదికలో స్ధానిక MRO అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.

February 26, 2026 / 08:39 PM IST

అధికారులతో కేంద్రమంత్రి ప్రత్యేక భేటీ

SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డయేరియా కారణాల అన్వేషణతో పాటు భవిష్యత్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీసెట్ బటన్ ఆన్ చేశారు. ఇకపై నీటి నమూనాల పరీక్షకు విశాఖపట్నం వరకు వెళ్ళకుండా సంబంధిత కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

February 26, 2026 / 08:36 PM IST

గాంధారిలో అక్రమ సారాయి విక్రేత అరెస్ట్

KMR: గాంధారి మండలం రామలక్ష్మణ పల్లిలో అక్రమంగా నాటు సారాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు వివరాలిలా.. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 3న గ్రామంలో సోదాలు నిర్వహించారు. నిందితుడు రాము తన ఇంట్లోని ఎయిర్ కూలర్‌లో దాచి ఉంచిన 4 లీటర్ల నాటు సారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

February 26, 2026 / 08:34 PM IST

తుది దశకు చేరుకున్న లిక్కర్ కేసు విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల రిమాండ్ రేపటితో పూర్తి కానున్న నేపథ్యంలో సిట్ అధికారులు మొత్తం 8 మంది నిందితులను రేపు ACB కోర్టులో హాజరుపరచనున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున రిమాండ్‌ను పొడిగించాలని అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. కాగా, A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా ఈ రోజే లొంగిపోయిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 08:34 PM IST

జంపాపురం జాతరలో భక్తి సందడి

KRNL: కోసిగి(మం) జంపాపురంలోని బసవేశ్వర స్వామి దేవాలయం వార్షిక జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి తనయులు యువ నాయకులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

February 26, 2026 / 08:34 PM IST

‘కాజీపేట సమస్యలపై పోరాటం చేపట్టాలి’

HNK: కాజీపేటలోని డివిజన్ ముఖ్య నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్థానిక సమస్యల పరిష్కారానికై పోరాడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6గ్యారంటీలు, 420హామీల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం చేయాలని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:34 PM IST

జుక్కల్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

KMR: జుక్కల్‌ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై MLA లక్ష్మీకాంతారావు గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్, అదనపు కలెక్టర్‌ విక్టర్‌తో కలిసి వివిధ శాఖల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా వైద్యం, గృహ నిర్మాణం, సాగునీరు, అటవీ, పర్యాటక రంగాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 08:33 PM IST

దళిత మాజీ సైనికుడి ఇంటి కూల్చివేతపై నిరసన

కడప కందిపాలెంలో దళిత మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేసి నెల రోజులు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో బాధితులు, అఖిలపక్ష నేతలు ఘటనా స్థలంలో శాంతి హోమం నిర్వహించి, రాజ్యాంగ ప్రతులతో నిరసన తెలిపారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చడం అమానుషమని, ఇది రాజ్యాంగ హక్కులపై దాడి అని నేతలు విమర్శించారు. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్నారు.

February 26, 2026 / 08:32 PM IST

తనిఖీలకు మీరు వెళ్తారా.. నన్ను వెళ్లమంటారా?: CBN

AP: శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటనలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను వెళ్లడం మొదలుపెట్టాలా? గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు. క్షేత్రస్థాయికి వెళ్లాలి. ప్రజలను కలిసి మాట్లాడాలి. అప్పుడే సమస్యలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి మీరు వెళ్లకపోతే నేను వెళ్లడం మొదలుపెడతా’ అని అన్నారు.

February 26, 2026 / 08:30 PM IST