ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పెషల్ మానిటర్ (గిరిజన సంక్షేమం) హేమంత్ కుమార్ గురువారం సందర్శించారు. గిరిజనుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అటవీ భూమి హక్కులు, విద్యా-ఆరోగ్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.