NDL: రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు నంద్యాల ఎంపీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా. బైరెడ్డి శబరికి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పునర్వికకు పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షల వైద్య సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవా గణేష్ నాయక్ సన్ని, కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ADB: ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన అవసర లేదని, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని ఝరి PHCలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో “స్వచ్ఛ మంగళగిరి 2.0” పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మొదటి దశ ప్రజల్లో మంచి చైతన్యం తెచ్చిందని, రెండో దశలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మార్చాలన్నారు.
కృష్ణా: డెలివరీ బాయ్గా తన అనుభవాలను అసెంబ్లీలో పెనమలూరు MLA బోడె ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. ఇతర దేశాల్లో డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చిన్నతనంగా చూడకుండా అందరూ చేస్తారని అదే స్ఫూర్తిని ఇక్కడ యువతలో నింపాలని తాను డెలివరీ బాయ్గా చేసినట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్కి కంపెనీల వద్ద టాయిలెట్స్, నుంచోడానికి నీడ వంటి సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ASR: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చ్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 28న పంపిణీ చేస్తారని అరకులోయ ఎంపీడీవో అడప లవరాజు పేర్కొన్నారు. కావున ఫించను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అన్నారు. మండలంలో ఉన్న 6359 ఫించన్లకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు బుధవారం తెలిపారు. సిబ్బంది ఈ నెల 27న పింఛను అమౌంట్ బ్యాంకు నుండి వితడ్రా చేయాలన్నారు.
NRPT: పంటలు వేసి రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు విడుదల కాలేదని సీపీఐఎం కార్యదర్శి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
MNCL: రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నుంచి విఠల్ నగర్ వెళ్లే దారిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్, బైక్ని ఢీ కొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మందమర్రి పట్టణం 2వ జోన్ కు చెందిన చంటి మల్లీశ్వరిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
HYD: కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని టోలీచౌకి సాలార్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, MLA కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థనలు (దువా) నిర్వహించారు. AIMIM పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
GDWL: అయిజ బస్టాండ్ పరిసరాలను రీజినల్ మేనేజర్ సంతోష్, గద్వాల డిపో మేనేజర్ సునీత పరిశీలించారు. శుభ్రత, డ్రైనేజీ, బస్సుల రాకపోకల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
RR: AOC కారిడార్ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్కేపురం ఆర్ఓబి నుంచి ఎల్బీనగర్ జోన్ TKR కమాండ్ వరకు, అక్కడి నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
VKB: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మొత్తం విద్యార్థులు 8,672 మందిలో 8,400 మంది హాజరయ్యారు. ఈరోజు పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
CTR: వెదురుకుప్పం సచివాలయ పరిధిలో జరుగుతున్న ఏకీకృత సర్వేని ఎంపీడీవో పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు, ఫుడ్ స్టాక్ వివరాలను ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రిషి, జయసుధ, నీరజ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ.విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
MLG: HYDలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల్లో ములుగు జిల్లా పోలీసులు సత్తా చాటారు. రెజ్లింగ్ 63 కేజీల విభాగంలో అమిత్ కుమార్ సింగ్ సిల్వర్ పతకం సాధించగా, జూడోలో 81 కేజీలు, 82 కేజీల విభాగాల్లో మేకల నాగరాజు రెండు సిల్వర్ పతకాలు గెలిచారు. ఈ విజయాలతో ములుగు జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. MLG SP కార్యాలయంలో SP విజేతలను అభినందించారు.
SKLM: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 26 నుండి ప్రారంభంకానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు.