ASR: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చ్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 28న పంపిణీ చేస్తారని అరకులోయ ఎంపీడీవో అడప లవరాజు పేర్కొన్నారు. కావున ఫించను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అన్నారు. మండలంలో ఉన్న 6359 ఫించన్లకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు బుధవారం తెలిపారు. సిబ్బంది ఈ నెల 27న పింఛను అమౌంట్ బ్యాంకు నుండి వితడ్రా చేయాలన్నారు.