MNCL: లక్షెట్టీపేట మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న ప్రభుత్వ నర్సరీని స్థానిక ఎంపీడీవో సరోజ సందర్శించారు. మంగళవారం ఆమె తిమ్మాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తప్పులు రాకుండా చూడాలన్నారు. నర్సరీని సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు.
GDWL: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
BPT: వైద్య ఖర్చుల వల్ల ఏ పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో మంజూరైన రూ.19,09,257 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను 29 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో అర్హులందరికీ సకాలంలో వైద్య సాయం అందుతోందన్నారు.
CTR: మెరుగైన ఉపాధి కోసం విజయపురం(మం) పన్నూరు సబ్స్టేషన్ నందు గల ప్రభుత్వ ఐటీఐ నందు చేరాలని ట్రైనింగ్ అధికారి మునికృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు కేరియర్ గైడెన్స్ అవగాహన నిర్వహించారు. రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం కోర్సుసు కలవని అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి మురళి పేర్కొన్నారు.
ఇటలీ మహిళా క్రికెట్ జట్టు కోఆర్డినేటర్ ప్రభాత్ ఏక్నెలిగోడ (57)పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా క్రీడాకారిణిని, శిక్షణ సమయంలో మోకాలి గాయానికి మసాజ్ చేస్తున్న నెపంతో ఆయన అసభ్యంగా తాకినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మార్చి 2025లో రోమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు 2026 T20 WCలో ఇటలీ అరంగేట్రం చేయడంతో ఈ వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కడప: జిల్లా యువతకు నైపుణ్య వేదికగా నిలవనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల వేగం, నాణ్యతపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు.
సత్యసాయి: కదిరి మండలం యాకలచెరువుపల్లిలో YCP కార్యకర్తలపై జరిగిన దాడిని నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.
AP: అనంతపురంలో ఫేస్బుక్ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్ భార్య ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్ అసభ్య మెసేజ్లు పెట్టాడు. వీటిని భర్త చూడడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యతో భర్త ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
KMR: బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం పిట్లంలో ఆయన మాట్లాడూతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA లక్ష్మీకాంతరావు కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయన్నారు.
SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.
SKLM: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి 18 మంది ప్రజలు ఆసుపత్రి పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనులతో తాగునీరు కలుషితమవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
E.G: రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరైన ప్రోటోకాల్తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.
NLR: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
RR: ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోని నోముల గ్రామంలో భార్యని భర్త హత మార్చాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నోములకి చెందిన మధర్మోని బాబు తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NDL: కొలిమిగుండ్ల పట్టణంలో ఇవాళ తాగునీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కాలనీ, శాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీలలో పైపులు లీకేజీ కావడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ సర్పంచ్ శివ రాముడు వెంటనే లీకేజీ ఉన్న ప్రదేశంలో పైపులను మరమ్మతులు చేస్తున్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.