నంద్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాలతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆశ్రఫ్ బాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. నిషేధిత వస్తువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు.
KDP: గోపవరంలో సంఘ సముద్రం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం రేగింది. సర్వే నెంబర్ 1122-2Aలో అధికారులు ఏర్పాటు చేసిన చూచిక బోర్డును తొలగించి ఓ వ్యక్తి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
KRNL: కోసిగి మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు సుందర్ తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. OC, BC విద్యార్థులు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు.
SRCL: ఇంటర్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సాయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.
HNK: కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో PMKVY 4.0 స్కీమ్ కింద ‘ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్’, ‘CNC ఆపరేటర్’ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
AP: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. మెరుగైన పారిశుధ్యం కోసం కార్పొరేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాను పైపులైన్ ద్వారా అధికారులు నిలుపుదల చేశారు. నాలుగు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వైద్య సేవలు అందిస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ‘ఆయా షేర్’ నిన్న వచ్చేసింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ సాంగ్ పై నెట్టింట నెగిటివ్ ప్రచారం సాగుతోంది. ఈ పాట మలయాళం అంటూ ట్రోల్ చేస్తున్నారు. నాని వేసిన డాన్స్ మూమెంట్స్ కూడా బాలేవని విమర్శిస్తున్నారు.
AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై చర్చ కొనసాగుతోంది. నెలకు రూ.10 వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు వర్తించవని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షల ఆదాయం మించి ఉంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అని వెల్లడించారు.
JGL: ధర్మారంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో 571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
VSP: విశాఖకు చెందిన తెలుగు యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. చదువుతో పాటు హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన ఆమె, సొంతూరికి చెందిన యూట్యూబర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నట్లు సమాచారం.
GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేయడంపై ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 27న ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు పోరాటం చేసినా తమ కుమార్తెకు న్యాయం జరగలేదని, అదే రోజు సత్యం–న్యాయం–ధర్మాన్ని సమాధి చేస్తున్నట్టేనని వారు వేదనతో చెప్పారు.
TPT: శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఈవోని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయి, ఈవోకి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఛైర్మన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.
KNR: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 57 కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.
AP: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెండ్పై ప్రభుత్వం వేటు వేసింది. కల్తీ పాల బాధితులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్యనారాయణను సస్పెన్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ కెనడి నియామకమయ్యారు. అయితే, రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో ఐదుగురు మరణించారు. 8 మంది బాధితులు వెంటిలేటర్పై ఉన్న విషయం తెలిసిందే.
GNTR: రాజధాని గ్రామాల్లో రూ. 1,000 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులను, ప్రస్తుతం ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న పాత సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ గ్రామ సభల్లో ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఉన్న పనుల గడువు పూర్తి చేయడానికి ఆ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ అదనపు పనులు కూడా వారికే ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.