ASF: కాగజ్ నగర్లోని ఖదీం మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో MLC దండే విఠల్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ శిక్షణతో నిత్య జీవితంలోనూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ వేడుకలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు (శనివారం) ఉదయం 8:30 గంటలకు బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు.
WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మూలమంత్ర హవనం, అనంతరం శేషవాహనంపై తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకోవాలని వారు కోరారు.
BPT: పొన్నూరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ్యుడు మరియు సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు 28వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షేక్ కరిముల్లా బాజీ, పట్టణ సీనియర్ నాయకుడు వి. లక్ష్మణమూర్తి, సచివాలయం నోడల్ ఆఫీసర్ తులసి, దివ్యరాణి పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా తెల్లరాళ్లపల్లి తాండలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అద్భుతమైన ఆలయం నిర్మించడం హర్షణీయమని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, సోమనాథ్ నాయక్ తదితరులు ఉన్నారు.
BDK: అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మౌలిక వసతుల లోపాలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సేవల నాణ్యత, మౌలిక వసతులపై నిన్న ప్రజా భవన్లో సమీక్ష నిర్వహించారు. పక్కా భవనాలు, ప్రహరీలు, మరుగుదొడ్లు వసతులపై సమీక్షించారు.
నిర్మల్ రాచరిక వైభవాన్ని భావితరాలకు అందించేందుకు మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉందని ప్రకటించింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ వారసత్వ కట్టడాలను పరిరక్షించనున్నట్లు తెలిపింది. శ్యామ్గఢ్, బత్తీస్గఢ్, ఖిల్లాగుట్ట వంటి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
RR: స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్లో 2026 నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ గన్నోజు వేణుగోపాల్ రంగారెడ్డి జిల్లా డీపీవో చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం డీపీవోని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నేర్చుకున్న విషయాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
KMR: బాన్సువాడలో జనసేన ఇన్ఛార్జ్ రవీందర్ చౌహన్ పట్టణంలోని గౌలిగూడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి జనసేన సభ్యత్వాన్ని ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి రూ.ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు.
WG: బాల్య వివాహాల నిర్మూలన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నరసాపురం బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.సూర్య ప్రకాశరావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం పీచుపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
TG: షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతోంది. కొత్త వాహనం కొన్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాలకు సంబంధించిన RCలు అందడంలోనూ జాప్యం అవుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరి పేర్లపై రెండు వాహనాలు ఉన్నప్పటికీ ఆ డేటా షోరూంల సర్వర్లో కనిపించడం లేదని చెబుతున్నారు.
BDK: కరకగూడెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభిస్తారని అలాగే పలు అభివృద్ధి, వివాహ వేడుకల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
VSP: సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలపై వివరించారు. చదువులో రాణించి దేశానికి సేవ చేయాలని సూచించారు.
ADB: పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఆరుగురు నిందితులు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు నిన్న తెలియజేశారు. పట్టణానికి చెందిన బాధితుడు కనిష్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామన్నారు. అనుమతి లేకుండా షాపు యజమానులు సెల్ ఫోన్లను కొనవద్దని CI సూచించారు.
అన్నమయ్య: జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది.