నిర్మల్ రాచరిక వైభవాన్ని భావితరాలకు అందించేందుకు మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉందని ప్రకటించింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ వారసత్వ కట్టడాలను పరిరక్షించనున్నట్లు తెలిపింది. శ్యామ్గఢ్, బత్తీస్గఢ్, ఖిల్లాగుట్ట వంటి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.