BHPL: చిట్యాల(M) బౌసింగ్ పల్లికి చెందిన అక్క-తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపారు. దెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య TG నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలిచింది. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా వ్యాప్తంగా వీరి విజయాన్ని ప్రశంసిస్తున్నారు.
W.G: భీమవరంలోని కలెక్టరేట్తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
TG: గల్ఫ్ దేశాల్లో తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంబసీ జారీ చేసే మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. భారత ఎంబసీలతో అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని వెల్లడించారు.
AKP: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామ సర్పంచ్ సఖిలేటి రాము(62) అనారోగ్యంతో కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. జనవరి నెలలో గుండెకు స్టంట్ వేసిన నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పత్తికుంట వారిపల్లి గ్రామానికి చెందిన రాఘవ నరసరాజు పొలంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. టీడీపీ ఇంచార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్యరాలు పద్మశ్రీ మత ప్రచారం నిర్వహిస్తున్నారన్న విషయంపై విచారణ చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి నివేదిక అనంతరం వరంగల్లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆయుష్) అధికారులకు నివేదిక పంపుతామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన 98 మంది రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, కల్టివేటర్లు వంటి పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
KMM: నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డితో కలసి డీజీపీ ప్రారంభించారు. పోలీసు కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాంప్లెక్స్ నిర్మించామన్నారు.
AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
WGL: గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో మరో రెండు రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఏడాది ప్రతి ఏడాది జాతర సమయంలో స్థానికంగా రాజకీయ అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు చర్చనీయాంశమవుతుండగా ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
MNCL: సామాజిక సేవా రంగంలో వెలమ సంక్షేమ మండలి ముందుంటుందని MLA ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో MLA పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేశారు. మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.
ELR: రాష్ట్రంలో మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా కూటమి పాలనలో అప్గ్రేడ్ చేసినట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం నూజివీడులో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీలకు వేసవిలో 15 రోజులు సెలవులు, తాగునీరు, దొడ్లకు రూ.87 కోట్లు, రూ.75 కోట్లతో కొనుగోలు చేసిన 5జీ మొబైల్స్ అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలను స్వీకరిస్తారు. కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
GNTR: తలశిల చంద్రశేఖరరావు మృతి పార్టీకి తీరని లోటని ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆదివారం వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు సంతాప సభలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ప్రముఖ నేతలు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల ఇంఛార్జ్లు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.