కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఆయన బాధపడినట్లు చెప్పారు. బొత్సకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడిని ప్రార్థించారు.
AP: రాష్ట్రంలో పాలు, నీళ్లు కల్తీ కావడంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఏపీలో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
BPT: అద్దంకి కార్యనిర్వాహక ఇంజినీరు ఆదేశాల మేరకు, సంతమాగులూరు ఉపవిభాగం పరిధిలోని కాలువలకు ‘వారబంధి’ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 2, 3 తేదీలలో రెండు రోజుల పాటు కాలువలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, రైతు సంఘాల సభ్యులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.
HNK: సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలిశారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల, MGM దవాఖానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ సుజిత్ రెడ్డిని సీఎం అభినందించారు. వరంగల్ ప్రాంతంలో వైద్య సేవల స్థాయిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం అన్నారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఆర్ఓబి అప్రోచ్ రోడ్డు పనులు వేగిరం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఆర్వోపీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెల రోజులలోపు అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆర్వోబీ పూర్తయ్యలోపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రైల్వే మరియు ఆర్& బీ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, సంఘం మండలాల్లో పాల డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కొవ్వు శాతం అధికంగా చూపించేందుకు అన్య పదార్థాలు కలుపుతున్నారని ఆరోపణ రావడంతో తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 6, 11, 13, 20వ వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఆనంద్ కుమార్ వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్తో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం వార్డులలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం తెలిపారు. సమావేశంలో నాయకులు కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులను మార్కెటింగ్ వేదికలను కల్పించడం ద్వారా వారి ఆదాయాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన దశ-1, గృహ జాబితా శిక్షణలో పాల్గొని మాట్లాడారు. ఖచ్చితమైన సమాచార సేకరణతోనే సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగుతుందన్నారు. ఈసారి సెల్ఫ్ ఇన్యూమరేషన్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత రెండు మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సౌతాఫ్రికా, జింబాబ్వేలపై చక్రవర్తి భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్ అతడికి మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో చక్రవర్తి ఖచ్చితంగా రాణిస్తాడని పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.