మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీసీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచారని బీసీ మేధావుల సంఘం తెలిపింది. కార్పొరేషన్లో ఆయా రాజకీయ పార్టీలు తమ పార్టీలోని బీసీ కార్పొరేటర్లకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు లింగం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడ గ్రామస్థులు గురువారం పెళ్లికట్నం నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్బంగా పెందోర్ హీరాబాయి గణపత్ రావు కుమార్తె వివాహానికి గ్రామస్థులు చందా జమ చేసి రూ.14,000 ఆర్థిక సహాయం చేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి ఉంటే ఈ విధంగా సహాయానికి ముందుంటామని వారు పేర్కొన్నారు.
NLG: నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి సుభాష్ రెడ్డి, చిన్నతుమలగూడెంకు చెందిన పులిపలుపుల నిర్మల మృతి చెందగా… వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
TPT: పాకాల మండలం ముద్దలపల్లి పొలాల్లో తలారిపల్లెకు చెందిన ముత్తిరేవుల సుబ్రహ్మణ్యం (45) మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయం ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NLR: ఆరోగ్య శాఖలో NHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని DMHO సుజాత గురువారం తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు మెరిట్ జాబితాను spsnellore.ap.gov.in/recruitment లో పరిశీలించాలని కోరారు.
WNP: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, ఉపాధ్యాయ హాజరు పట్టికలు, స్టాక్ రూమ్లోని నిత్యవసర సరుకులు గడువు తేదీ, భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.
ప్రకాశం: బీసీవైఎం పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీసీ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సూర్యాపేట నుంచి కోదాడ వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NRML: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ మూవీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయినట్లు టాక్. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీ పరిధిలోని రోడ్డు అధ్వానంగా తయారైంది. గుర్రాలపాలెం నుంచి బాణం, జి.సిగడాం, పొందూరు మండలాలకు వెళ్లే రోడ్డులో గత ఏడాది కిందట మెటల్ రాళ్లు వేసి వదిలేశారు. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
NDL: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 10 రోజులవుతున్నా నీటి సరఫరా చేయకపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పనులను సాకుగా చూపి అధికారుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాగేందుకు చుక్క నీరు లేదు కానీ రోడ్లకు క్యూరింగ్ చేసేందుకు ఫిల్టర్ హౌస్ నీటిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ATP: రజక జాతి చిన్నారి మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రజక సంఘం నాయకులు కిరణ్, సురేష్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మౌనికపై దాడి చేసి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచి రెడ్డి రాంబాబు చెక్ పవర్ను పలు ఆరోపణలతో 10 నెలల క్రితం అధికారులు రద్దు చేశారు. అయితే తన తప్పు లేదని జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పదిసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్టుని ఆశ్రయించగా చెక్ పవర్ పునరుద్ధరించాలని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అమలుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.