సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్లో విండీస్తో జరిగిన 5 మ్యాచ్ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.
WNP: హాస్టల్ నిర్మాణ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 10వ తేదీ కల్లా భవనాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ క్లర్క్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
BHNG: మార్చి 3న మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
TG: ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడ గుడిసెలు తొలగించి పేదలను అధికారులు తరలించిన విషయం తెలిసిందే.
GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో రెండో విడత సర్పంచుల శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, అలంపూర్, రాజోలి మండలాల సర్పంచ్లు హాజరు అయ్యారు. గ్రామ అభివృద్ధి, సభల నిర్వహణ, డ్రైనేజీ, ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పిలుపునిచ్చారు.
TG: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ల సేవలను గుర్తించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో భేటీ అయిన జగ్గారెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలో తన అభిప్రాయాన్ని ఖర్గే ముందు ఉంచారు.
MDCL: మేడ్చల్ చెక్పోస్ట్ సమీపంలోని యూ-టర్న్ వద్ద వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. చెక్పోస్ట్ వైపు వచ్చే వాహనదారులు వేగం తగ్గించి, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్కు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
NTR: వత్సవాయి మండలంలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు సైంటిస్ట్లు శివప్రసాద్, భవాని, సత్యనారాయణ పరిశీలించారు. పడిపోయిన మొక్కజొన్నలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. లేత వయసులో ఉన్న పంటలో ఎకరానికి 13:0:44 లేదా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున యూరియా పిచికారీ చేయాలన్నారు.
SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: GDCC బ్యాంకు అభివృద్ధికి మేనేజర్లు సమన్వయంతో పని చేయాలని ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు చెప్పారు. గురువారం మేనేజర్లు, సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉమ్మడి జిల్లాలోని 44 బ్రాంచ్లలో రైతుల రుణాలను 2026 మార్చి 31 నాటికి పూర్తిగా రికవరీ చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సీఈఓ ఫణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ATP: జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా శ్రీదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది కొత్త పీడీకి అభినందనలు తెలియజేశారు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది. తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు రూ.63 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో కన్నడ చరిత్రలోనే తమిళ మార్కెట్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ఇది సరికొత్త రికార్డు సృష్టించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
JN: బదిలీపై జోగులాంబ గద్వాల్ జిల్లాకి వెళ్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం సన్మానించారు. జిల్లా పేరును జాతీయ స్థాయికి కలెక్టర్ తీసుకెళ్లారు అని కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ సాధించారు అని, విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించారన్నారు.