కొరటాల శివ చెప్పిన దాని ప్రకారం.. ఎన్టీఆర్ 30(ntr 30)లో యంగ్ టైగర్ మృగాల వేట ఓ రేంజ్లో ఉండబోతోంది. మరి అలాంటి మృగాల నాయకుడు ఎలా ఉండాలి? భయకంరంగా ఉండాలి. అలాంటి విలన్ పడితే గానీ ఎన్టీఆర్ 30లో మృగాల వేట కిక్ ఇవ్వదు. తాజాగా అలాంటి విలన్నే రంగంలోకి దింపాడు కొరటాల.
తెలంగాణలో గత మూడేళ్లలో కంపా నిధుల(CAMPA funds) నుంచి కేటాయించిన రూ.610 కోట్ల నిధులను వినియోగించకపోవడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు ఉండదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) సోమవారం పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీదర్ మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను కలిసిన టీపీసీసీ నేతలకు గాంధీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కర్ణాటక మంత్రి నాగరాజు తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. రూ.1609 కోట్ల ఆస్తులను ప్రకటించగా.. అవీ వ్యవసాయం, వ్యాపారం, భవనాల అద్దె ద్వారా కూడబెట్టానని తెలిపారు.
విశాఖపట్టణంలో (Visakhapatnam) రోజు రోజుకో పరిణామాలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాాయి. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో పని చేస్తున్న డీజీఎం (DGM) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ప్లాంట్ కార్యాలయంలోనే అతడు మృతి చెంది ఉన్నాడు. దీంతో ప్లాంట్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోల...
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఓ నమ్మకం ఉంది. ఇక ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కడా చూసినా చేపల ఘుమఘుమలే. మరి అలాంటి మృగశిర కార్తె రోజు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టనుంది.
ఓటీటీలో వస్తోన్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మితిమిరీన శృంగారంపై కళ్లెం వేయాలని భావిస్తోంది. మూడంచెల సెన్సార్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.