IPL 19వ సీజన్ ప్రారంభానికి ముందు జరిగే వేడుకలను BCCI అధికారికంగా రద్దు చేసింది. గతేడాది జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులు గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఎలాంటి ప్రారంభోత్సవ వేడుకలు ఉండవని స్పష్టమైంది. అయితే ఈ IPL 2026 ముగింపు వేడుకల కోసం లీగ్ నిర్వాహకులు & BCCI ప్లాన్ చేస్తున్నట్లు బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి పోలీసు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. సైబర్ మోసాలు, చిన్నారులు, మహిళలపై నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిపి దుష్ప్రయోజనాలను తెలియజేశారు.
KDP: కమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో కిజియా తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుడు, కోఆప్సన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హజరు కావాలన్నారు. అన్ని అంశాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
SRPT: ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. తన అభిమాన జట్లయిన RCB, SRH లపై మక్కువతో సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మైదానంలో ఆటగాళ్లు సిద్ధమవుతుంటే, ఇటు అభిమానులు ఇలా తమ క్రేజ్ను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇవాళ ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. CM చంద్రబాబు ఈ మేరకు చారిత్రక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. 4 గంటల చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించి, తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజధాని భవితవ్యాన్ని శాశ్వతంగా ఖరారు చేసే దిశగా ఇది కీలక ముందడుగు.
TPT: నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుక్రవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా పసల చెంగయ్య ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా గోళ్ళ వీరాస్వామి ఎన్నికయ్యారు. ఇతర పదవులకు కూడా సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ BRS ఫ్లోర్ లీడర్గా 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య-రఘురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని రాజయ్య ఈ సందర్భంగా నూతన ఫ్లోర్ లీడర్కు దిశానిర్దేశం చేశారు.
భైరవాసనం అనేది ఒక యోగా భంగిమ. ఇది శరీరాన్ని పక్కకు పడుకోబెట్టి, ఒక కాలును తలపైకి లేదా మెడ వెనుకకు తీసుకువచ్చే సంక్లిష్టమైన ఆసనం. ఇది నడుము, కాళ్లు, వెన్నెముకను సాగదీయడానికి సహాయపడుతుంది. నడుము కండరాలు బలంగా మారుతాయి. ఏకాగ్రత, సమతుల్యత మెరుగుపడుతాయి. ఈ ఆసనం కొంచెం కష్టతరమైనది. కాబట్టి యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది.
SDPT: శ్రీరామనవమి పురస్కరించుకుని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం తన ఆర్ట్ గ్యాలరీలో స్వయంగా చిత్రించిన సీతారాముల చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ దంపతులైన సీతారాముల జీవితం నేటి యువ జంటలకు మార్గదర్శకం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవతా విలువలతో కూడిన రాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.
అనకాపల్లి: జిల్లాకు మూడు అదనపు కోర్టులు మంజూరయ్యాయి. వీటిలో ఎలమంచిలిలో అదనపు సివిల్ జడ్జి కోర్టు, నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు ప్రతిపాదన మేరకు క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు IPL సిద్ధమైంది. 19వ సీజన్లో భాగంగా ఇవాళ్టి నుంచి 65 రోజుల పాటు వినోదం పంచనుంది. ఈ సీజన్లో 10 జట్ల మధ్య 13 వేదికల్లో 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఇవాళ్టి సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH ఢీకొననుంది. IPL లైవ్ మ్యాచ్లను Star Sports, JioHitstar Appలో వీక్షించవచ్చు.
WGL: వరంగల్ రంగశాయిపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాద రహిత సమాజం నిర్మాణం కోసం విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు.
WGL: వరంగల్ రంగశాయిపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాద రహిత సమాజం నిర్మాణం కోసం విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలోని కాప్రి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని దుర్వ శైలజ (20) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె, మార్చి 27 తెల్లవారుజామున కనిపించకుండా పోయిందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, చామనచాయ వర్ణం కలిగిన ఆమె అదృశ్య సమయంలో తెలుపు టాప్, గోధుమ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI బాలాజీ పేర్కొన్నారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సోదర భావంతో పండుగల నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్, మహేందర్ తదితరులున్నారు.