VKB: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన తుప్పలి వెంకటమ్మకి సీఎం సహాయనిధి కింద రూ. 60,000 మంజూరైంది. ఈ చెక్కును గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప, ఉప సర్పంచ్ జె.దస్తయ్య అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని సర్పంచ్ తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ నాయకులను ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించారు. ఆశ వర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్ను హౌస్ అరెస్ట్ చేశారు.
NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం ప్రారంభమైంది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి ఉపాధ్యాయులకు అకాడమిక్ విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కాంప్లెక్స్ సమావేశంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
ATP: MLA పరిటాల సునీత ఆదేశాలతో చిన్నంపల్లి పంచాయతీ అన్నే ఫెర్రర్ కాలనీలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కోచింగ్ సెంటర్ నందు చదువుతున్న వారికి మాజీ మండల కన్వీనర్ మారినేని లక్ష్మీనారాయణ తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
NLG: నకిరేకల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంతు సేవాలాల్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజానికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ చెవిగోని రజిత, ఇతర నాయకులు పాల్గొన్నారు.
KRNL: నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ పాల్గొన్నారు.
ATP: సింగనమల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 50% నిధులు కేటాయించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం చాలా దారుణం అన్నారు.
MBNR: హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో వ్యవసాయ అధికారి (ఏవో) కిరణ్ కుమార్ వరి పంటను పరిశీలించారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంట ఎదగలేదని, నాట్లు స్థిరంగా ఉన్నాయని గుర్తించారు. రైతులకు పంటలు కోలుకోవడానికి 19.19.19 ఎరువులు, జింక్ వినియోగం, నీటిని సరిగా అందించడం, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని వివరించారు.
KNR: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా కార్యకర్తలు చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేశవపట్నం నుంచి తరలివెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పీ. విజయలక్ష్మీ, ప్రధాన కార్య దర్శి లీలాదేవి ఉన్నారు.
కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెదపారుపూడి ఎస్ఐ ఆర్. శ్రీధర్ వానపాముల జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి టీమ్-2 సభ్యులతో కలిసి సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ని ఆశ్రయించాలని సూచించారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సవిత సందర్శించారు. స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల చేనేత వస్త్రాలను పరిశీలించి, అమ్మకాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
BPT: భట్టిప్రోలు మండలం ఐలవరం, గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం అసెంబ్లీని సందర్శించారు. శాసనసభ పనితీరుపై అవగాహన కల్పించుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కలిసి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ పాత్ర, ప్రజా సమస్యల పరిష్కార విధానం గురించి ఆయన విద్యార్థులకు వివరించారు.
NTR: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలులో స్వస్తిశ్రీ చంద్రమాన విరోధి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారం మార్చి 3న కేతు గ్రహ సంచార చంద్రగ్రహణం సా.3.19కు ప్రారంభమై, సా.5.03కు మధ్యకాలం, సా.6.46కు సమాప్తి చెందుతుంది. గ్రహణం కారణంగా ఉదయం 7.30 వరకు బాలభోగం, మహా నివేదనలు నిర్వహించి, తదుపరి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడతాయని తెలిపారు.
TG: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిగ్, ప్లాట్ఫారమ్ వర్కర్ల సంక్షేమ బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, గిగ్ వర్కర్ల జీవితాల్లో భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
KRNL: పెద్దకడబూరులోని బీసీ, ఎస్సీ కాలనీల్లో MPP నిధులు రూ.15 లక్షలతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. MPP శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సుజాత కలిసి భూమి పూజ నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.