NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మెట్పల్లిలో నిర్వహించిన ఛాంపియన్షిన్లో పాల్గొని 5 స్వర్ణ, 8 రజత,14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ ఉదయ్, సోమవారం అభినందించారు. విద్యార్థుల కృషిని కొనియాడుతూ..వారికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.
KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.
NLG: దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహానికి రజక సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసి 2 నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి సమస్యలపై 200 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జీవన శివాలయంలో ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
TG: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి సందడి మొదలవ్వగా.. ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ను విజయ్ దేవరకొండ బాబాయ్ రోహిన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి ఆహ్వానించారు.
TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇటీవల మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.
HYD: మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు.
MLG: స్టేషన్ ఘనపూర్ పట్టణానికి చెందిన రాజ్ కుమార్ ఇటీవల మేడారం వెళ్తుండగా తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. వెంటనే బాధితుడు పస్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీని త్వరగా గుర్తించారు. ఇవాళ బాధితుడు రాజ్ కుమార్కు పోగొట్టుకున్న ఫోన్ను పోలీసులు అందజేశారు.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కోమటి కుంట అమ్మకంపై ఉద్రిక్తత దారితీసింది. రెండు రోజులుగా హిటాచి యంత్రంతో కుంటను చదులు చేస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ సాంబయ్య, వార్డు సభ్యులు, రైతులు, సంఘ నేతలు అట్టి యంత్రాన్ని నిలిపివేశారు. ఇట్టి విషయాన్ని రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
RR: చౌదరిగూడ మండలం ఏదిర గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, ఏదిర గ్రామమాజీ సర్పంచ్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
సత్యసాయి: పెనుకొండ మండలం అంబేద్కర్ సర్కిల్లో కూటమి నేతలు సోమవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, చెప్పులతో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ హటావో – దేశ్ కో బచావో’ అంటూ నినాదాలు చేశారు.
HNK: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని కేయూ వీసీ ప్రతాపరెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం గ్రామీణ ఉత్పత్తుల సంతను వీసీ ప్రారంభించారు. కోవిడ్ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచిందని, సేంద్రియ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, నిమ్మల శ్రీనివాస్ ఉన్నారు.
ప్రకాశం: కంభంలోని పరీక్ష కేంద్రాలను ఎస్సై శివకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.