• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!

WG: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

February 24, 2026 / 07:12 PM IST

భారీ ఆపరేషన్.. 104 మంది అరెస్ట్

TG: ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షలు, 204 సెల్‌ఫోన్లు, 141 సిమ్‌లు, అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్‌టాప్‌లు జప్తు చేశామని తెలిపారు.

February 24, 2026 / 07:10 PM IST

బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

NTR: నందిగామలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్‌ కర్నూలు జిల్లాలో జరిగిన కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్లిన కుటుంబంపై దాడి చేసి చిన్నారిని తొక్కడం అమానుషమని ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 07:10 PM IST

అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష

అన్నమయ్య: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పెద్దమండ్యం మండల అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ CITU, IFTU ఆధ్వర్యంలో తంబళ్లపల్లె ICDS ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలన్నారు.

February 24, 2026 / 07:10 PM IST

ఏఎంసీకి యూకే వైద్యుడి ఆధునిక పరికరాలు విరాళం

విశాఖలోని Andhra Medical Collegeకు యూకేలో స్థిరపడిన డాక్టర్ ఐ.కే. రాజు యూరాలజీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు విరాళంగా అందజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి సమక్షంలో డీజే స్టెంట్లు, గైడ్ వైర్లు, కాథెటర్లు అందజేశారు. ఈ పరికరాలు నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగపడతాయని విభాగాధిపతి డాక్టర్ ఐ. చంద్రశేఖర్ తెలిపారు.

February 24, 2026 / 07:09 PM IST

రేపటి నుంచి అందుబాటులో తిరుమల లడ్డు

CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో రేపు తిరుమల లడ్డులు విక్రయించడం జరుగుతుందని టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల నుంచి లడ్డూలను తెప్పించి విక్రయిస్తామన్నారు. ఒక్కో లడ్డు రూ.50 చొప్పున విక్రయించడం జరుగుతుందని తెలిపారు.

February 24, 2026 / 07:09 PM IST

కీసర చుట్టూర ప్రాంతాల్లో పెరిగిన ఉక్కపోత..!

MDCL: కీసర చుట్టూర ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా పెరిగింది. రెండు రోజులుగా ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి మరింత పెరిగినట్టుగా అనిపిస్తోంది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 07:07 PM IST

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ: సీఐ

KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను కోడుమూరు సీఐ తబ్రేజ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను తనిఖీ చేసి,మండలంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని,కేసులను త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 07:06 PM IST

‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

VZM: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమ స్థలం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:06 PM IST

విన్నర్‌గా నిలిచిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

PPM: అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా పోటీలలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సత్తా చాటుతున్నారు. ఉత్సాహంగా సాగుతున్న పోటీలలో రన్నింగ్‌లో విన్నర్‌గా నిలిచారు. అలాగే తగ్గఫ్ వార్ పోటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టీంలో పాల్గొని విజయం సాధించారు. అలాగే, వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సత్తా చాటారు.

February 24, 2026 / 07:05 PM IST

క్రీడా మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

SDPT: నరేంద్ర మోడీ ప్రేరణతో నిర్వహిస్తున్న 2025-26 సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కోహెడ మండల బీజేపీ అధ్యక్షుడు జాలిగం రమేష్ మాట్లాడుతూ.. మార్చి 1-3 వరకు అసెంబ్లీ, 5-7 వరకు పార్లమెంట్ స్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, హాకీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు ఎంపీ బండి సంజయ్ బహుమతులు అందజేస్తారన్నారు.

February 24, 2026 / 07:05 PM IST

100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి: వీసీ

MBNR: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని PU వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా కళాశాలలు కృషి చేయాలని ఆయన సూచించారు.

February 24, 2026 / 07:05 PM IST

గురజాలలో వర్షం.. ఆందోళనలో రైతులు

PLD: గురజాల మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం వర్షం కురిసింది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే మబ్బులు పట్టి చిరుజల్లులు మొదలవడంతో గ్రామ సమీప ప్రాంతాలలో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు ఇళ్లల్లోని పట్టాలు తీసుకుని పరుగులు తీశారు. కల్లాల్లో ఉన్న మిర్చి రాశులపై పరదాలు కప్పారు.

February 24, 2026 / 07:05 PM IST

55 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. మొత్తం 55 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం లభించింది. అలాగే.. విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యాసాయి, చీరాల, రాజమండ్రిలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది.

February 24, 2026 / 07:04 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేతలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నేత శ్రీరాముల రామచంద్రం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:04 PM IST