SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటలకు డప్పు నరేష్ (22)పై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నరేష్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో కంది 108 సిబ్బంది ఈఎంటీ చిరంజీవి, పైలెట్ రమేష్లు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KRNL: ఆదోని పట్టణ శివారులోని ఇస్వీ కొండల్లో ఆదివారం పోలీసులు ఒక జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలోని బృందం 9 మంది జూదరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.17,000, 7 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. బోయ గోవిందరాజులు, బోయ పరశురాంలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
అనకాపల్లి కూరగాయల మార్కెట్లో వర్తకులు స్థానిక రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కూరగాయల మార్కెట్ను సందర్శించి స్థానిక వర్తకులతో మాట్లాడారు. వర్తకుల, రైతుల సమస్యలపై చర్చించారు. స్థానిక రైతుల నుంచి టమోటాలు కొనుగోలుకు వర్ధకులతో ఒప్పందం కుదిర్చారు.
WGL: మామునూరు మండలలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన–2027 శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణాంకాల సేకరణ ఖచ్చితంగా జరగాలని తెలిపారు. ప్రతి వివరాన్ని బాధ్యతగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ కట్టుబాటుతో పనిచేయాలని తెలిపారు.
VSP: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ప్లాంట్ నుంచి ఏడాదికి 17.8 MMT ఉక్కు ఉత్పత్తి కానుంది.
KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ సమయంలో 8977716661 నెంబరుకు ఫోన్ చేసుకోవచ్చు అన్నారు.
PDPL: రామగుండం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 50వ డివిజన్ లబ్ధిదారులకు కార్పొరేటర్ సతీష్, మనాలి ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద ప్రజలకు CMRF వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NZB: ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతినెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు. నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నరు.
బాపట్లలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందజేస్తారు. మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ ఆఫీస్లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని రాజీవ్ కాలనీలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, SP, DFO, మార్కెట్ చైర్మన్ తదితరులు ఉన్నారు.
ATP: వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 50 గ్యాస్ ఏజెన్సీలలో వీఆర్వోలు అందుబాటులో ఉండి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
MNCL: SC 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సమంజసం కాదని నాయకులు అన్నారు.
W.G: తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఉగాది నాటకోత్సవాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్.డీ. విల్సన్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను ఆదరించాలని, తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వెలసిల్లుతాయన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.