JN: రాఘవపురం గ్రామానికి చెందిన యువకుడు P. రాకేష్ కార్తికేయ(పూజారి రాజు) దర్శకత్వంలో పాలకుర్తి యువత తీసిన ‘ఒక ఫోటో ప్రేమ కథ’ అనే షార్ట్ ఫిలింను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని, పాలకుర్తి ప్రాంతాల్లోని నటీ, నటులకు అండగా ఉంటామన్నారు.
NRPT: మద్దూర్ మున్సిపల్ పరిధిలోని బీంపూర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కొనియాడారు. రాబోయే రెండేళ్లలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
SRD: ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దళితులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ద్వారకాపేట మెయిన్ రోడ్డుపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు జరిపారు.దీంతో పైప్ లైన్ పగిలి నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో మున్సిపల్ ఛైర్మెన్ లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
KMM: ముదిగొండ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డాక్టర్ నీరుకొండ ఉషారాణికి స్వర్ణ నంది ఉగాది పురస్కారం లభించింది. ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో మొగిలి & ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఆమెను సత్కరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళా సాధికారత బాలకార్మిక నిర్మూలనకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని ఆమె తెలిపారు.
ADB: సామజిక చైతన్యానికి సాహిత్యమే ఊపిరి అని సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలోని చెడును రూపుమాపడానికి కవులు, రచయితలు తమ రచనల ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
నల్గొండ మండల పరిధిలోని జీట్టితల చెన్నారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
సత్యసాయి: జిల్లాలో 190 మంది కానిస్టేబుళ్ల బదిలీలను ఎస్పీ సతీష్ కుమార్ పారదర్శకంగా చేపట్టారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఐదు సబ్ డివిజన్లలో సిబ్బందిని కేటాయించారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని నిబంధనల ప్రకారం కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ప్రొజెక్టర్ ద్వారా ఖాళీల వివరాలను ప్రదర్శించి సిబ్బంది సమక్షంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
GDWL: గత వారం అనివార్య కారణాలతో ఆగిపోయిన ప్రజావాణి రేపటి నుంచి యథావిధిగా సాగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం (రేపు) గద్వాల కలెక్టరేట్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు.
MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ దివ్య నీటి నాణ్యతను పరీక్షించి వివరించారు. బోరు, ఆర్వో నీటితో పోలిస్తే మిషన్ భగీరథ నీటిలో అవసరమైన మినరల్స్ సమతుల్యంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు భగీరథ నీటినే వినియోగించాలని సూచించారు.
TG: నీరు మానవ మనుగడకు ప్రాణాధారమని మంత్రి సీతక్క తెలిపారు. నీటి దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టు విలువైనదని, నీటి వృథా కొనసాగితే భవిష్యత్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భూగర్భ జలాల పెంపుకోసం ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. చెట్లు పెంచడం, చెరువులను సంరక్షించి నీటి వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించినందుకు గాను ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ఆయనను సత్కరించారు.
TG: వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ MLAని గెలిపించండని ప్రజలకు CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నుంచి గెలిచిన MLAని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్సే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రజలపై కక్షతో వ్యవహరించకూడదని హితవు పలికారు. అభివృద్దికి అడ్డం పడుకుంటే ఆగుతామా.. సీఎంగా సిద్దిపేటకి రాలేదా? అని అన్నారు.
SKLM: కోటబొమ్మాళి(M) తిలారులో ఇప్పిలి షణ్ముఖరావు గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మతల్లి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవాసొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు రూ. 15వేలు అందజేశారు. మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ చేతులు మీదుగా ఈ నగదును ఇప్పించారు. పేద కుటుంబం కావటంతో సహాయం చేసినట్లు తెలిపారు.