• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సమస్యను పట్టించుకొని సూపరింటెండెంట్ అవసరమా?’

ATP: రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం కార్మికుల సమస్య గోడు పట్టించుకోని సూపరింటెండెంట్ అవసరమా అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రస్తుత సూపరింటెండెంట్ వైఖరిని మల్లికార్జున తప్పు పట్టారు. అలాగే, సెక్యూరిటీ గార్డ్ రవిని తక్షణమే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 4, 2025 / 04:42 PM IST

అత్యాచారం నిందితులను శిక్షించాలని ధర్నా

ATP: గుంటూరులో వృద్ధురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, విజయ్ మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

February 4, 2025 / 04:27 PM IST

‘ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు’

ATP: గుంతకల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 90 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తిమ్మాపురం శివాలయానికి, నల్లదాసరపల్లి, చింతలంపల్లి, దోసలోడికి సుంకులమ్మ దేవాలయాలకు, పామిడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఓబులాపురం ఆంజనేయస్వామి దేవాలయాలకు ఈ నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

February 4, 2025 / 04:19 PM IST

ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరు: వైసీపీ ఎంపీ

AP: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో తెలిపారు. అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. పోలవరం కెపాసిటీ తగ్గించడం వల్ల 7 లక్షల ఎకరాలకు అందాల్సిన నీరు.. కేవలం 3.2 లక్షల ఎకరాలకే అందుతుందన్నారు. ఈ అన్యాయాన్ని ఆంధ్ర ప్రజలు క్షమించరని అన్నారు.

February 4, 2025 / 02:29 PM IST

రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా: ఆది శ్రీనివాస్

TG: రాష్ట్రంలో BRS పార్టీ BCల పేరుతో మరోసారి రాజకీయం చేయాలని చూస్తోందని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ MLA ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో సర్వేలు నిర్వహించి నివేదికలు బయటపెట్టని BRS ఇవాళ కులగణనపై మాట్లాడుతుందని మండిపడ్డారు. BRS చెప్పిన కులగణనలో 51 శాతం BCలు ఉంటే తమ కులగణనలో 56 శాతం BCలు ఉన్నారని తెలిపారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతామన్నారు.

February 4, 2025 / 02:25 PM IST

వైభవంగా సూర్య భగవానునికి క్షీరాభిషేకం

VZM: గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి ఆలయం పై వేంచేసి ఉన్న ఉష ఛాయ పద్మిని సమేత సూర్య నారాయణస్వామి వారికి విశేష క్షీరాభిషేకం జరిపారు. మంగళవారం రథసప్తమి పురస్కరించుకొని సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 4, 2025 / 02:14 PM IST

ఛలో హైదరాబాద్‌కు సామాజిక తెలంగాణ మహాసభ మద్దతు

SRPT: ఈనెల 7న హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టే లక్ష డప్పులు, వేల గొంతుల సభకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య తెలిపారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు.

February 4, 2025 / 01:51 PM IST

పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

SKLM: కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు వెల్లడించారు.

February 4, 2025 / 01:48 PM IST

‘విజయ గౌరీ నామినేషన్‌కి తరలి రండి’

SKLM: ఫిబ్రవరి 6న విజయ గౌరీ నామినేషన్‌కి తరలి రావాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని స్థానిక యుటిఎఫ్ భవన్‌లో అధ్యాపక, ఉపాధ్యాయులతో సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సంక్షేమానికి ఉద్యమ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ గెలుపు అవసరమని పేర్కొన్నారు.

February 4, 2025 / 01:44 PM IST

వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం నందు కొలువు దీరిన శ్రీ సద్గురు సుందర సాయిబాబా మందిరం 30వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

February 4, 2025 / 01:39 PM IST

బ్యాంకు వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన

NRML: కుబీర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు వినియోగదారులకు మంగళవారం స్థానిక ఎస్సై రవీందర్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిచయం లేని వ్యక్తులకు ఓటీపీ, ఫోన్ పాస్వర్డ్‌లు చెప్పొద్దని సూచించారు. ఆర్థిక నిరాలకు గురైతే వెంటనే బ్యాంకు, పోలీసులకు సంప్రదించాలని అన్నారు.

February 4, 2025 / 01:39 PM IST

మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి రహదారి సమస్య

SKLM: నందిగం మండలం బడబంధ, కోటిపల్లి, కోటియా కొండపేట, బంజీరుపేట గ్రామాల రహదారి సమస్యలపై మంగళవారం నందిగం జనసేన పార్టీ అధ్యక్షుడు తాడేల చిరంజీవి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో మంత్రిని కలిసిన ఆయన… రహదారి సమస్యలను వివరించి పరిష్కరించాలని మంత్రిని కోరారు.

February 4, 2025 / 01:36 PM IST

విషాదం.. విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి

ADB: నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు.

February 4, 2025 / 01:26 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన పెనమలూరు ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసిన బోడె ప్రసాద్ తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు.

February 4, 2025 / 01:24 PM IST

‘కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసమే’

E.G: దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసమే ప్రవేశపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 4, 2025 / 01:24 PM IST