WGL: ఆశ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని BRTU ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వైద్య కార్యాలయం సూపర్డెంట్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందిస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు.
ADB: ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలంటే మహిళలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ ఎస్సై పూజ అన్నారు. “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంట్లోని వారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా మహిళలు ప్రోత్సహించాలని కోరారు.
AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం రిషి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళకు 242 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 108 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
MLG: మండలంలోని చేరుపల్లి (కొత్తపేట) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ బాబాయి సోదరుడు, పార్టీ నాయకుడు ముత్తినేని వసంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశదిన కర్మకు కాంగ్రెస్ యువ నేత కుంజా సూర్య హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
TPT: జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, శ్రీ సిటీ పరిశ్రమల విస్తరణకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. SIPB, CRDA ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులు, నెల్లూరు జిల్లాలో మహిళల కోసం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలో సెమీ కండెక్టర్ పరిశ్రమ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశాల పైనా చర్చించి నిర్ణయం తీసుకునన్నట్లు సమాచారం.
PPM: రీ సర్వే జరుగుతున్న గ్రామాలలో ఉప తహసీల్దార్, సర్వేయర్ల డిప్యూటేషన్లు ఉంటే, వాటిని రద్దు చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. రెవెన్యూ, తదితర అంశాలపై అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు.
W.G. గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సోసైటీ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయలేకపోవడం సిగ్గు చేటని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ విమర్శించారు. మంగళవారం తణుకు కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా “నడి రోడ్డు మీద పడుకొని దణ్ణం పెడుతూ.. సహకార సంఘాల JAC ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జీవో. 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలన్నారు.
ELR: వట్లూరులోని టీటీడీసీ వెలుగు కార్యాలయంలో ఈ నెల 26న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ గణపతి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం నేరుగా కేంద్రానికి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చు.
కృష్ణా: కేంద్ర శిక్షణ సంస్థ సహకారంతో రూపొందించిన అప్లికేషన్ డెవలపర్, వెబ్ & మొబైల్ కోర్స్ను మార్చి నెల నుంచి పెడన స్కిల్ హబ్లో ఉచితంగా ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కోర్స్ ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వెబ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ నైపుణ్యాలను నేర్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
కడప: నగరంలోని 30వ డివిజన్ NTR సర్కిల్, నాయక్ సాహెబ్ వీధిలో సీసీ రోడ్ పనులను మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో ఎంపీ లాడ్స్ ద్వారా రూ. 2 లక్షల నిధులతో పనులు చేపట్టారు. భూమి పూజ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, RIC అధికారులు పాల్గొన్నారు.
NZB: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడులపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
SRPT: రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ. 125 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లను రాష్ట్ర హోజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలోని తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి సత్యసాయి నీటి పథకం ఆధునీకరణకు రూ. 50 కోట్లు, మరో 38 గ్రామాల్లో కొత్త నీటి సౌకర్యం కోసం రూ. 55 కోట్లు మంజూరు చేయాలని కోరారు.