• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

’28న కరప మండల పరిషత్ సర్వసభ్య సమావేశం’

KKD: కరప మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జె. శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎజెండాతో పాటు ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు.

February 24, 2026 / 05:35 PM IST

‘విద్యార్థులు తమ లక్ష్యాలతో ముందుకు సాగాలి’

ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలోని గేట్స్ కళాశాలలో ‘నెలనెలా విలువల వెన్నెల’ అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎస్ కే లెనిన్ బాబు హాజరయ్యారు. సంకల్పం అంకితభావం, కృషి అనే అంశాలపై విద్యార్థులకు తన అనుభవాలను జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, విజయ రహస్యాలను వివరించారు.

February 24, 2026 / 05:35 PM IST

డయేరియా డేంజర్ బెల్స్.. పెరిగిన బాధితుల సంఖ్య

AP: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాధితుల సంఖ్య 54కు చేరింది. ఆసుపత్రి నుంచి ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. టెస్టింగ్ కోసం వాటర్ శాంపిల్స్ పంపించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ప్రజలంతా వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు భయపడొద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

February 24, 2026 / 05:33 PM IST

జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి

NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 05:32 PM IST

‘ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం’

MBNR: మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ విజయంతి తెలిపారు. మొత్తం 216 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యం 5 నిమిషాలకు మించితే లోపలకి రానివ్వమన్నారు.

February 24, 2026 / 05:32 PM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: షేక్ సలాం

KMR: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. రేపటి నుంచి మార్చి 17 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 17,953 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మంచినీటి వసతి కల్పించామన్నారు.

February 24, 2026 / 05:32 PM IST

‘స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి’

KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు స్మశాన వాటిక కోసం స్థలం చూపించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ జెర్మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల నాయకులు జాఫర్ ఖాన్ పటేల్ మాట్లాడుతూ ముస్లీంలకు స్మశాన వాటికకు సరియైన స్థలం లేక ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

February 24, 2026 / 05:32 PM IST

అజీమ్ ఖాన్ మృతికి ఎమ్మెల్యే కోరం నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీమ్ ఖాన్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య అజీమ్ ఖాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా అన్నివేళలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:31 PM IST

మహిళల సమస్యలపై వర్సిటీ వీసీలతో రాయపాటి శైలజ సమీక్ష

GNTR: విశ్వవిద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం మంగళగిరిలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీల వీసీలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘క్యాంపస్ అంబాసిడర్’ కార్యక్రమం అమలుతో పాటు, విద్యార్థినుల సవాళ్లపై పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు.

February 24, 2026 / 05:30 PM IST

బోర్డు పరీక్షలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

KMM: ఖమ్మం జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ లోపు కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

బావను నరికి చంపిన మరదలు

TG: మొగిలయ్య(70) అనే వ్యక్తి తన మరదలు(50) నరికి చంపిన ఘటన హన్మకొండ జిల్లా హాసన్‌పర్తిలో జరిగింది. భార్య చనిపోవడంతో మొగిలయ్య తన మరదలితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ అతడి మరదలు చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 05:30 PM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు పానగల్ మండలంలోని బహదూర్ గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కొత్తపేటలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన ఆయన చేశారు. మహ్మదాపూర్, కొత్తపేటల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 05:30 PM IST

జనగణన-2027 రాజ్యాంగబద్ధమైనది: కలెక్టర్

NLR: సాధారణ కోవిడ్, కుటుంబ సర్వేల కన్నా, జనగణన-2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని హరినాధపురంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

మార్చి 3న విఘ్నేశ్వరుని ఆలయం మూసివేత

కోనసీమ: మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కారణంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు స్వామి వారికి చేసే అన్ని సేవలు ఉదయం 9 గంటల వరకు మాత్రమే జరుగుతాయని, 9.30 గంటల నుంచి ఆలయం మూసివేస్తామని పేర్కొన్నారు. మరునాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

‘భూసేకరణ వేగవంతం చేయాలి’

VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ పూర్తి కావాలన్నారు.

February 24, 2026 / 05:29 PM IST