• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డీఎస్పీని కలిసిన నూతన కౌన్సిలర్

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.

February 24, 2026 / 01:09 PM IST

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

SDPT: జగదేవ్ పూర్ మండలం అలీరాజ్పేటలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి, వ్యవసాయ అధికారి వసంతరావు, యువరైతు శ్రీనాథ్ రైతులకు ప్రకృతి సేద్యంలోని మెళకువలను వివరించారు. రసాయన రహిత సాగుతో భూసారం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:08 PM IST

పెంట్లంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ కారం శివ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. శ్రీ భవాని కంటి ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు చూపు సమస్యలు, మసక చూపు, కంటి నొప్పులు వంటి సమస్యలను పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారు. 

February 24, 2026 / 01:08 PM IST

పరిశీలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు: పొన్నం

HYD: ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఆందోళనలకు దూరంగా సంస్థ పురోగతి, కార్మిక సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాల కోసం కలిసి పనిచేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 01:08 PM IST

వేగంగా కొనసాగుతున్న NIT అభివృద్ధి పనులు

HNK: పట్టణ కేంద్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత క్యాంపస్‌లో రూ.137.77 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతుండగా..మరో రూ.618.79 కోట్లతో ఆధునిక సౌకర్యాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 2047 నాటికి విద్యార్థుల సంఖ్యను రెండింతలు చేయాలనే లక్ష్యంతో రెండో క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి.

February 24, 2026 / 01:08 PM IST

రైల్వే గేటు తాత్కాలిక మూసివేత

NLG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చిట్యాల – శ్రీరామ్ నగర్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్-30 ని తాత్కాలికంగా మూసివేశారు. కి.మీ. 53/5-6 వద్ద ఉన్న ఈ గేటును ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈరోజు నుంచి బుధవారం సా. వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను చూసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 01:07 PM IST

ఎర్రగుంట్ల సుందరయ్య నగర్‌లో నాకాబందీ

KDP: తెల్లవారుజామున ఎర్రగుంట్ల సీఐ కె.విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇళ్లను సోదాలు చేశారు. ఎలాంటి రికార్డు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.

February 24, 2026 / 01:06 PM IST

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL:ఎ లిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు 28 లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. గ్రామ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. ఫ్రీ బస్సు, రైతు బోనస్, వైద్య సాయం, ఇందిరా ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

February 24, 2026 / 01:06 PM IST

భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 215.

February 24, 2026 / 01:06 PM IST

వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ ప్రారంభం

NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను తెలుసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

February 24, 2026 / 01:05 PM IST

పరీక్షల భద్రత కోసం నిషేధాజ్ఞలు అమలు

WGL: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా జరుగడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంగళవారం తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు చేరకూడదన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిషేధమని వెల్లడించారు.

February 24, 2026 / 01:05 PM IST

కాశీబుగ్గ శ్రీ సంతోషిమాత ఆలయంలో చోరీ

SKLM: కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి తూలంపావు బంగారు ఆభరణాలు చోరీ చేశారని ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 01:03 PM IST

సింహాద్రిపురంలో రెండోవ రోజు ఏసీబీ దాడులు

KDP: సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 2వ రోజుకూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పలు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిన్న సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. మంగళవారం ఏసీబీ అధికారులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.

February 24, 2026 / 01:03 PM IST

ఆ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి, సాయి పల్లవి మూవీ?

తమిళ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండగా.. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు టాక్. 2026 వేసవిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ ‘పాకెట్ నావెల్’తో, సాయి పల్లవి ‘రామాయణ’తో బిజీగా ఉన్నారు.

February 24, 2026 / 01:03 PM IST

అంబేద్కర్ విగ్రహాంపై దాడి

VKB: మోమిన్‌పేట్ మండలం అమ్రాదికలాన్‌లో శనివారం గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మండలంలోని అంబేద్కర్ సంఘాలు ఇవాళ మండి పడ్డాయి. లేని పక్షంలో మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

February 24, 2026 / 01:02 PM IST