• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్: శ్రీధర్ బాబు

TG: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్నారు. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.O ప్రారంభిస్తమన్నారు. ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడిపించాలన్నదే అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్ తీసుకొచ్చామని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చాలనేదే లక్ష్యం అని వెల్లడించారు.

February 24, 2026 / 06:08 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పోచారం‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు బిక్షపతి, శ్రీశైలం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

February 24, 2026 / 06:08 PM IST

ఆదోనిలో దేవాలయ భూమి కబ్జా ఆరోపణలు

KRNL: ఆదోని శుక్రవారం పేటలో సర్వే నంబర్ 315లోని 4 ఎకరాలు 2 సెంట్ల దేవాలయ భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ అక్రమంగా కబ్జా చేశారని ఇవాళ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ నార్త్ మండలం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయ ఆస్తులను రక్షించి భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:07 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ

BDK: కొత్తగూడెం క్లబ్ నందు విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.

February 24, 2026 / 06:06 PM IST

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ సీబీఐ జేడీ

JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 06:06 PM IST

‘గౌరవెల్లి ప్రాజెక్టుపై రాజకీయం వద్దు’

SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు అభివృద్ధి కంటే దానిని రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

February 24, 2026 / 06:04 PM IST

బాపట్ల వ్యవసాయ కళాశాలకు వర్సిటీ హోదా

BPT: బాపట్ల వ్యవసాయ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించాలని 1965-69 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కోరారు. మంగళవారం కళాశాలలో జరిగిన సమ్మేళనంలో వారు ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.ప్రసూన రాణితో పాటు పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.

February 24, 2026 / 06:04 PM IST

గోదావరి పుష్కరాలపై ఎస్పీ సమీక్ష

జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘాట్లు, వీఐపీ ఘాట్లు, తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

February 24, 2026 / 06:04 PM IST

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి 9959226289కు ఫోన్ చేయవచ్చని సూచించారు. వనపర్తి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:04 PM IST

‘ఇందిరమ్మ గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు’

KNR: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు తొంగిచూస్తాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జరిగిన తమ్మనవేణి మల్లమ్మ, పుట్ట స్వరూప, పుత్లీ బేగం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

February 24, 2026 / 06:02 PM IST

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 13 పతకాలు

MBNR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంగళవారం విజేతలను జిల్లా ఎస్పీ డి. జానకి అభినందించారు. అలాగే వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.

February 24, 2026 / 06:01 PM IST

పేదల గుడిసెల కూల్చివేత అమానుషం: మాజీ ఎంపీ

KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడం అమానుషమని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు లేదా నివాస స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:01 PM IST

‘అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తాం’

CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన DMAC రెండవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, ఎన్ వేలాయుధం, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:00 PM IST

37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:00 PM IST

ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భూ సేకరణ సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు, భవనాలపై చర్చించారు.

February 24, 2026 / 06:00 PM IST