NLG: దామెర భీమనపల్లిలో రహదారిపై ఉన్న గుంతలను సర్పంచ్ జిల్లా అలివేలు ఆధ్వర్యంలో పూడ్చివేయించారు. గ్రామంలోని 6వ వార్డులో రోడ్డు అధ్వాన్నంగా తయారై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆమె స్పందించారు. సొంత చొరవతో మట్టి పోయించి గుంతలను పూడ్చి రోడ్డును చదును చేయించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
HNK: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని తహసిల్దార్ విజయలక్ష్మి అన్నారు. పరకాల గర్ల్స్ హై-స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని, చదువు మన తలరాతను మారుస్తుందని తహసిల్దార్ అన్నారు. ఆర్ఐ దామోదర్, స్కూల్ ఇన్ఛార్జ్ పద్మజ, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ ఉన్నారు.
SRPT: భూ రిజిస్ట్రేషన్ వివాదంలో మాజీ కౌన్సిలర్ నెమ్మది బాబుపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన ఘటనలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ శిక్షణ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.
VKB: అనంతగిరిలో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి విచ్చేసిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎస్ఏపీ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.
PLD: వినుకొండ శివారు పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
BDK: మణుగూరు మండలం రామానుజవర గ్రామ సమీపంలో ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం స్పందించి 50 లక్షల వ్యయంతో మరమ్మత్తులు పనులను చేపట్టారు. ఈ పనులను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ASR: ఉపాధి హామీ పథకం కింద వెంటనే ఉపాధి పనులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ లాసేరు, బల్డ్గడ్డ గ్రామాల్లో సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని కోరారు.
MDK: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆమెతోపాటు జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీఆర్ భుజంగ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని కైర్గాం జాతీయ రహదారిపై సోమవారం ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్య సహాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
TPT: నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో వెంకటగిరి పట్టణంలోని టిడ్కో హౌసెస్, ఎన్టీఆర్ కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. మొత్తం 112 ఇళ్లను తనిఖీ చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించి, ఆధార్ వివరాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 17 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, 18 వాహనాలను సీజ్ చేశారు. నేర నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 140 పిటిషన్లు అందాయి. జిల్లా ఎస్పీ పి. జగదీష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడి కుటుంబ కలహాలు, రస్తా వివాదాల వంటి సమస్యలను స్వయంగా విన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
NLR: మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చేరబోవు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ పి.లక్ష్మీ నారాయణ తెలియజేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో చదివిన విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మందిరంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.
AP: మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఇప్పటికే అరెస్ట్ ప్రక్రియ పూర్తికావడంతో ముందస్తు బెయిల్కు ఈ పిటిషన్ విచారణ అర్హత లేదని తెలిపింది. అనంతరం ఈనెల 13కు వాయిదా వేసింది.
SRCL: వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్మన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ.. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.