AKP: మాడుగుల గాంధీ పార్కులో బుధవారం సర్పంచ్ యడ్ల కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు ఆధ్వర్యంలో ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. పార్కులో కొంత మంది ద్విచక్ర వాహనాలను నిలపడంతో లోపలికి వెళ్లి కూర్చునే వారు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అటువంటి ఇబ్బందుల దృష్ట్యా పార్కులో రెండు వైపులా వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది.
NLG: పోలీస్ లాకప్ డెత్లో మరణించిన కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి, డీఎస్పీ జి. రవిని కలిశారు. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్న కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు.
MBNR: తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ రిసెప్షన్ వేడుకకు హాజరై సినీ హీరో విజయ్ దేవరకొండ దంపతులను ఆశీర్వదించారు. వివాహ బంధంతో ఒక్కటైన జంట అన్యోన్యంతో ఆదర్శ దంపతులుగా వెలుగొందాలని ఎంపీ ఆకాంక్షించారు.
SRPT: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ పోలీసులు సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణంలోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఏఎస్సై మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, లింక్లను నమ్మవద్దని హెచ్చరించారు.
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో రేషన్ షాప్ను టీడీపీ నాయకులు పారేపల్లి నరేశ్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రేషన్ షాప్ ద్వారా నాణ్యమైన బియ్యం, పంచదార అందిస్తామన్నారు. రేషన్ షాప్ వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమకు తెలియజేయాలని తెలిపారు.
KNR: కెనాల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన రామడుగు మండలంలో జరిగింది. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వరాల రాకేష్ (24) బుధవారం మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొక్కెర కుంట శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో కొంతమంది స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో కెనాల్ నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
SKLM: పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, కేసులు దర్యాప్తు, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసులుకు ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించిరు. ప్రజల నమ్మకం నిలబెట్టే విధంగా పోలీసులు వ్యవహరించాలని అన్నారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి అబ్బిరెడ్డి వారి వీధి లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పాక పూర్తిగా దగ్ధమైంది. గుబ్బల సత్యవతి అనే మహిళ నిర్వహిస్తున్న తాటాకు పాక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్దం అయినట్లు స్థానికులు అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.
KDP: ఖాజీపేట మండలంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు మండల విద్యుత్ ఇంజినీర్ నాగరాజు బుధవారం తెలిపారు. గురువారం ముత్తులూరుపాడులో ఉదయం 9 గంటలకు, బుడ్డాయిపల్లెకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సిబ్బంది రానున్నారని, బకాయి దారులు బిల్లులు చెల్లించాలన్నారు. బకాయిలు చెల్లించకపోతే సప్లై ఆపేస్తామని హెచ్చరించారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో గురువారం 2020 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. కె.చిట్టిన నరసమ్మ తెలిపారు. కళాశాలలో ఇది 63వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. అరోకా 26 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ VC హాజరువుతారన్నారు.
కృష్ణా: పెనమలూరులో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నవీన్తో కలిసి పెనమలూరులోని 100 అడుగుల రహదారి మార్గంలో, కామినేని ఆసుపత్రి ఎదురుగా జరిగే ప్రైవేట్ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.
కృష్ణా: పెనమలూరులో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నవీన్తో కలిసి పెనమలూరులోని 100 అడుగుల రహదారి మార్గంలో, కామినేని ఆసుపత్రి ఎదురుగా జరిగే ప్రైవేట్ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.
KDP: రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. భవిష్యత్తులో చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ATP: మున్సిపాలిటీకి బకాయిలు పడ్డ ఇంటి, కుళాయి పన్నులను చెల్లించని వారి ఇళ్లకు సంబంధించిన కుళాయి కనెక్షన్లను బుధవారం సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా, ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని కమిషనర్ శివ రామక్రిష్ణ తెలిపారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పన్నులను వెంటనే చెల్లించాలన్నారు.
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాల విద్యార్థిపై గత నెలలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం అధికారులు న్యాయ విచారణను వేగవంతం చేశారు. నివేదికలో నేరం రుజువైతే పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.