ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు మార్కెటింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, ఈనెల 16త తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.