• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన

KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి PHC పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం డా. రంగ లక్ష్మీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CHO లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ.. 2 వారాలు నుంచి,దగ్గు,జ్వరము,అలసట బరువు తగ్గడం రాత్రిపూట చెమటలు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న పేషెంట్లు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.

March 5, 2026 / 07:19 PM IST

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ, డెంటల్ సేవలు, గర్భిణీల హెల్త్ చెకప్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ పూర్తి స్థితిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. ఎన్.సి.డి విభాగంలో ఏవైనా మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

March 5, 2026 / 07:18 PM IST

‘కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం’

ASR: పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జయరాజు రైతులకు సూచించారు. గురువారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమగ్ర పెరటికోళ్ల యూనిట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెరటికోళ్ల యూనిట్లలో జీవ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సరైన ఆహార నియమాలు అనుసరించి, కోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు.

March 5, 2026 / 07:18 PM IST

కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు ఏర్పాటు..!

 W.G: ఉండి మండలంలో పలు గ్రామాల్లో కిసాన్ మోర్చా గ్రామ కమిటీలను ఏర్పాటు కోసం జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 గురు సభ్యులతో కమిటీలు వేశామన్నారు .మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచర్ల సూర్యప్రకాష్ ,డొక్కు వెంకటేశ్వర రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 5, 2026 / 07:17 PM IST

దెబ్బతిన్న నరాలకు ఇంజెక్టబుల్ జెల్

ప్రమాదాల్లో గాయపడినప్పుడో, పలు సమస్యలతోనో శరీరంలోని నరాలు దెబ్బతింటుంటాయి. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారం కనుగొన్నారు. నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్‌ను అభివృద్ధి చేశారు. దెబ్బతిన్న నరాలను మళ్లీ పెరిగేలా చేసి, కోల్పోయిన సెన్సేషన్ను పూర్తిగా తిరిగి తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు అంటున్నారు.

March 5, 2026 / 07:16 PM IST

ఈ నెల 7వ తేదీన న్యాయ నిర్మాణ్ భవన్‌కు శంకుస్థాపన

SRCL: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శ్రీకారం జరగనుంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రూపు దిద్దుకోనున్న న్యాయస్థాన భవనానికి ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 10 గం.లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ వెల్లడించారు.

March 5, 2026 / 07:15 PM IST

ఎట్టకేలకు గని ప్రమాదంగా నమోదు

MNCL: ఎట్టకేలకు శాంతిఖని గని ప్రమాదంపై కార్పొరేట్ యజమాన్యం స్పందించింది. ఓ ప్రధాన అధికార యూనియన్ అగ్రనేత జోక్యంతో గని ప్రమాదంపై ఉన్నతాధికారుల్లో శీగ్రగతిన కదలిక వచ్చింది. బెల్లంపల్లి శాంతిఖనిలోఇటివల జరిగిన ప్రమాదంలో కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతి వేలు కు తీవ్రంగా గాయం అయింది.

March 5, 2026 / 07:15 PM IST

‘బ్యాంకు రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి’

ELR: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణ లక్ష్యాలను ఈనెలాఖులోగా పూర్తిగా సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో గురువారం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి రుణాలు, యూనిట్ల స్థాపన పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇంతవరకు 1242.48 కోట్ల రూపాయలు మంజూరు చేసారని అన్నారు.

March 5, 2026 / 07:14 PM IST

‘రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత’

ASR: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. గురువారం పాడేరు మండలంలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో ఉన్న పుస్తకాలతో పోలిస్తే, ఇప్పుడు అందజేస్తున్న రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రతను కల్పిస్తాయన్నారు.

March 5, 2026 / 07:14 PM IST

‘అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి’

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని 54, 48 డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం కమిషనర్ తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత కాల పరిమితి లోపు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

March 5, 2026 / 07:14 PM IST

‘ఇసుక అక్రమ రవాణా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు’

NRML: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా బాసర,సారంగాపూర్ సరిహద్దుల్లో అంతరాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

March 5, 2026 / 07:13 PM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల చదువును స్వయంగా పరీక్షించగా 9వ తరగతి విద్యార్థి సరిగా చదవలేకపోవడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి ప్రాథమికంగా చదివే నైపుణ్యాలు తప్పనిసరిగా రావాలని, 30 రోజుల్లో మార్పు లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 07:13 PM IST

రూ. 76 లక్షలతో 1,040మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి

కృష్ణా: అవనిగడ్డలో ఆర్టీసీ డిపో వద్ధ నుంచి ఏఎస్ఆర్ కళ్యాణ మండపం వరకూ ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయింది. ఉపాధి నిధులు రూ.76 లక్షలతో 1,040 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన నిధులతో రోడ్డు నిర్మాణం సాకారమైంది. పీఆర్ డీఈఈ సురేష్ బాబు, ఏఈ బ్రహ్మానంద బాబు పర్యవేక్షించారు.

March 5, 2026 / 07:12 PM IST

APK ఫైల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగాఉండాలి: ఎస్పీ

NRPT: రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకొని సైబర్ కేటుగాళ్లు అనేక రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడని, అమాయక ప్రజల స్మార్ట్ ఫోన్లకు APK ఫైల్స్ పంపించి ఆర్థికంగా దోచుకుంటున్నారని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. అనవసరపు మెసేజ్ లను, ఏపీకే ఫైల్స్‌ను తెరవకూడదని హెచ్చరించారు. గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లకూడదని సూచించారు.

March 5, 2026 / 07:12 PM IST

‘ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి’

ఆసిఫాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని TSGHM జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పర్ష చంద్రశేఖర్, రాథోడ్ సుభాష్ కోరారు. గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. గత వేసవిలో 50 ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ నిధులను విడుదల చేయాలని, స్కావెంజర్లకు హాజరుతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని కోరారు.

March 5, 2026 / 07:11 PM IST