కృష్ణా: అవనిగడ్డలో ఆర్టీసీ డిపో వద్ధ నుంచి ఏఎస్ఆర్ కళ్యాణ మండపం వరకూ ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయింది. ఉపాధి నిధులు రూ.76 లక్షలతో 1,040 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన నిధులతో రోడ్డు నిర్మాణం సాకారమైంది. పీఆర్ డీఈఈ సురేష్ బాబు, ఏఈ బ్రహ్మానంద బాబు పర్యవేక్షించారు.