KNRL: పత్తికొండలో గురువారం జరిగిన కార్యక్రమంలో శ్యామ కుమార్ 77 మంది లబ్ధిదారులకు రూ.49 లక్షల 70 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఆధారంగా ప్రభుత్వం నిధులు అందజేస్తోందని పేర్కొంటూ లబ్ధిదారులు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.
W.G: పోషకాహార లోపాన్ని నివారించేందుకు క్యారెట్, పాలకూర వంటి వాటిలో బయో- ఫోర్టిఫికేషన్ పద్ధతులను అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం(M) వెంకట రామన్నగూడెం డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో దిగుబడి, నాణ్యత, తెగుళ్ల నిరోధకత, కూరగాయల పంటలో ఆధునిక పద్ధతులు అనే అంశంపై వెబినార్ నిర్వహించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారపు సంతలో మార్పు చేశారు. వచ్చే గురువారం ఉగాది పండుగ సందర్భంగా వారపు సంతను బుధవారం నిర్వహిస్తున్నట్లు సంత గుత్తేదారు హరికృష్ణ తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు ఈ మార్పును గమనించి బుధవారం జరిగే సంతలో తమ వ్యాపారాలను నిర్వహించాలని ఆయన సూచించారు. సంతకు వచ్చే వారంతా సహకరించాలని కోరారు.
KNR: తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకుని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు.
WNP: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే కడవరకు పని పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన మండల, పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, DCC అధ్యక్షుడు శివసేనరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
JGL: కోరుట్ల పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.
WNP: కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు.
CTR: అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడమే లక్ష్యంగా ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చిత్తూరు క్రైమ్ పోలీస్ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. పీవీకేఎన్ కాలేజీలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, వేధింపులు, డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులకు వివరించారు.
BSK: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్పుతో పాటు నిరుపేదలకు ఉపాధి హామీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతుందని తెలిపారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
BDK: బూర్గంపాడు మండలం పోలారం గ్రామంలో వర్సా రమణయ్య – సుజాత దంపతుల కుమారుడు రాజేష్ మరియు అక్షిత వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని R&R కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సుమారు 1000 ఎకరాల భూసేకరణ ముగిస్తే, నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని వారు స్పష్టం చేశారు.
BHPL: స్తంభంపల్లి గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలైన లక్ష్మి (40) తన భర్తకు నిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు SI మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
E.G: ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో గురువారం మొత్తం 64 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42,89,541 విలువైన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై కూటమి నాయకులతో చర్చించారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రెడ్డి కాలనీలో బైక్పై వెళ్తున్న వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడులు చేశాయి. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలో కోతుల తీవ్రత అధికంగా ఉందని, పలుమార్లు అధికారులకు, నాయకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
VZM: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద రూ. 20 వేలు అందిస్తున్నాయి. జిల్లాలో అర్హులైన రైతులకు మూడవ విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.