TG: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకముందు అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు.