TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.