TG: హైదరాబాద్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం ’ధర్మవాణి‘ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. 10AM నుంచి 5PM వరకు అనేక మంది అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి తమ సమస్యలను విన్నవించారు. వారి సమస్యలను ఓపికగా విన్న కమిషనర్.. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి ఆదేశించారు.