TG: రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ 6 గ్యారంటీల అమలుపై రాజకీయ సెగలు రేగనున్నాయి. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. మరోవైపు, ఇదే అంశంపై బీజేపీ ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. సభ లోపల బిల్లులతో, బయట నిరసనలతో ఇవాళ రాష్ట్ర రాజకీయం హీటెక్కనుంది.