TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధురనగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఓటుహక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని, వృధా చేసుకోవద్దని సూచించారు. యువత కూడా ఓటు వేసిన తర్వాత మిగతా పనులు చూడాలన్నారు.