TG: నేటి నుంచి ఈనెల 21 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, HYD సహా పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే, మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణకు విస్తరించనున్నాయి. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.