AP: స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి కేంద్ర ప్రభుత్వానికి సూచించింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన వినుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో ఏఐ ద్వారా వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. మార్చి నుంచి అన్ని గ్రామాల్లో చెత్త సేకరించి సంపదగా మారుస్తామన్నారు.