AP: SC, ST విద్యార్థుల ఎంపికపై గతంలో Dy. స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలను IPS సునీల్ నాయక్ తప్పుబట్టారు. ‘రిజర్వేషన్ అనేది ఛారిటీ కాదు. 2వేల ఏళ్ల చారిత్రక నేరాన్ని రాజ్యాంగం సరిదిద్దుతోంది. మేము కేవలం పరీక్షలే కాదు, మీరు నిర్మించిన శతాబ్దాల గోడలను బద్దలుకొట్టాం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఆలోచనా విధానం ఇలా ఉంటే అణగారిన పిల్లలకు ఏం సందేశం వెళ్తుంది’ అని ప్రశ్నించారు.