AP: కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై నేరాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ‘గంజాయి లేదని హోంమంత్రి అంటున్నారు. మదనపల్లిలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి డ్రమ్ములో వేసి చంపారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది’ అంటూ ప్రశ్నించారు.