AP: డోలోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నుంచి స్వామి, అమ్మవార్లు కొండ దిగువకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఉత్సవం పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే, మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.